ప్రేమను దక్కించుకునేందుకు ఈ మధ్యకాలంలో చాలా మంది అనేక దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే నాగ్పూర్ లో చోటుచేసుకుంది. ఓ యువతి ప్రేమాయణం కొనసాగిస్తోంది. గత సోమవారం ఇంట్లో తల్లిదండ్రులతోపాటు అందరూ బయటికి వెళ్లడంతో ఏకంగా తన ప్రియున్ని ఇంటికి పిలిపించుకుంది. ఎవరు రారు అనుకుని ప్రియుడితో ఏకాంతంగా గడిపింది. అయితే అప్పుడే అనుకోని షాక్ తగిలింది. తన ప్రియుడితో ఇంట్లో ఉండగానే యువతి సోదరుడు ఇంటికి చేరుకున్నాడు. ఆందోళనకు గురైన యువతి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ బండారం బయటపడుతుందని భావించింది. ఈ క్రమంలోనే తమ్ముడు ఎలాగైనా విషయాలన్ని తల్లిదండ్రులకు చెబుతాడని భావించి తమ్ముడినే చంపేస్తే విషయం బయటకు రాకుండా ఉంటుందని కర్కశంగా ఆలోచించింది. తన ప్రియుడితో కలిసి తమ్ముడిని గొంతు పిసికి చంపివేసింది. అకారణంగా చనిపోయిన తన కుమారుడి చావుపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు యువతితో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.