శ్రీకాకుళం: శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో సహా పలువురు టీడీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. తాడేపల్లి, విశాఖపట్నంలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ గూండాల దాడికి నిరసనగా బుధవారం టీడీపీ బంద్కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్సులను తిరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు ఎంపీ రామ్మోహన్ నాయుడును, పలువురు టీడీపీ నేతలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. టెక్కలిలో బంద్ చేపట్టేందుకు రోడ్డు మీదకు వచ్చిన టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విశాఖలో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావును స్వగ్రామం రాజాంలో హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ అ మండల కేంద్రాలలో పలువురు టీడీపీ నాయకులను పోలీసులు ముందస్తు హౌస్ అరెస్టు చేశారు.