విజయవాడ: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడికి నిరసనగా టీడీపీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. బంద్ పిలుపు నేపథ్యంలో జిల్లాలో ఎక్కడకక్కడ టీడీపీ ముఖ్య నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో గొల్లపూడిలో టీడీపీ నేత మాజీమంత్రి దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేశారు. దేవినేని అరెస్ట్ చేసి నున్న పోలీస్ స్టేషన్కు తరలించారు. మీడియాతో ఉమా మాట్లాడుతూ.. పోలీసులు, జగన్ ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను హరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఆటవిక పాలన సాగుతోందని, అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని, ఇప్పటికైనా సీఎం జగన్ తెలుసుకోవాలని దేవినేని సూచించారు.