విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన ఉద్యమం 250వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కూర్మన్నపాలెం వద్ద కార్మిక సంఘాలు 25గంటలు నిరవధిక దీక్ష చేపట్టాయి. 250మందికి పైగా కార్మికులు ఈ దీక్షలో పాల్గొన్నారు. నవంబర్ 1వ తేదీ విశాఖలో భారీ ర్యాలీ చేపడుతున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. విశాఖ స్టీల్ప్లాంట్ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తం చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా పోరాటం మరింత ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించినట్లు కార్మిక సంఘాలు తెలిపాయి.