ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పల్లీలతో ఈ సమస్యలకి గుడ్‌బై చెప్పండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 14, 2021, 02:31 PM

వేరుశెనగ మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది.  వేరుశనగ ప్రతిరోజు తీసుకోవడం కారణంగా ఒబేసిటీ సమ స్య తగ్గి... అలా గే బరువు కూ డా తగ్గ వచ్చును. అంతే కాకుండా ప్ర తి రోజుకు గుప్పెడన్ని పల్లీలు తీసుకుంటే చాలా ఆరోగ్యకరం గా ఉంటుంది.ప్రెగ్నెన్సీ సమయంలో పల్లీలు తీసుకుంటే చాలా మంచిది  మహిళలు ప్రెగ్నెన్సీ గా ఉన్న సమయంలో వేరుశెనగ అనేది చాలా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఫెర్టిలిటి ని వేరుశనగ అభివృద్ధి చేస్తుంది. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ మహిళల లో అప్పుడప్పుడు సంభవించే కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది. అందుకే పల్లీలను నీళ్లలో నానబెట్టి మహిళలు తీసుకొంటే పుట్టబోయే బిడ్డ కూడా చాలా ఆరోగ్యంగా పుడతారు.  ప్రతిరోజు మనం వేరుశెనగ కాయలు తినడం కారణంగా మన శరీర చర్మం చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ముఖ్యంగా మన శరీరంలో ముడతలు అనే సమస్య కు చెక్ పెట్టవచ్చు. అలాగే పల్లీల నూనెలో కొంచెం నిమ్మరసం వేసుకుని మొహానికి అప్లై చేసుకుంటే... మన ఫేస్ చాలా అందం గా మారిపోతుంది.  పల్లీల నూనె జుట్టుకు చాలా మంచిది. ఈ నూనె మన తలకు రాసుకుంటే చుండ్రు సమస్యను దరికి రాకుండా చేయవచ్చు. అంతేకాదు జుట్టు రాలిపోకుండా చూస్తుంది పల్లీల నూ నె. తద్వారా మనకు బట్టతల రాకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పల్లీలను తినడానికి ఆసక్తి చూపాలి. తద్వారా మన ఆరోగ్యానికి ఎ న్నో లాభాలు కలుగుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com