ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఓ బాలికపై వరుసకు బాబాయి అయ్యే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఆత్రేయిపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదో తరగతి పాసైంది. ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటోంది. ఆమె చిన్నతాత కుమారుడు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫోన్ లో బాలికను నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఐతే ఇటీవల బాలికకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధం కుదిర్చారు. పెళ్లి చేసుకుంటే తమ మధ్య జరిగింది బయటపెడతానని బాలికను ఆమె బాబాయి బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిస్తే నీ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారని భయపెట్టాడు. అతడి వేధింపులు భరించలేకపోయిన బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిశ పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.