పశ్చిమగోదావరి జిల్లాలో యూనియన్ బ్యాంకులో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. టీవీ 9 కథనం ప్రకారం.. తాడేపల్లిగూడెం యూనియన్ బ్యాంకులో భారీ కుంభకోణం ఒకటి బయటపడింది. తప్పుడు పత్రాలతో సుమారు 6 కోట్లలో రుణం కాజేశారు. చేపల చెరువు లీజు పేరిట తప్పుడు పత్రాలతో కోట్ల రూపాయలు రుణం పొందారు ఆరుగురు వ్యక్తులు. ఈ ఆరుగురితో అప్పటి బ్యాంక్ మేనేజర్ కుమ్మక్కైనట్టు బ్యాంక్ అధికారులు గుర్తించారు.
అయితే స్కాం విషయం నిగ్గుతేలడంతో బ్యాంకు ఉన్నతాధికారులు సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలతో రుణం పొందిన ఆరుగురు పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారికి సహకరించిన అప్పటి బ్యాంకు మేనేజర్ పై శాఖాపరమైన చర్యలకు సిద్ధమయ్యారు బ్యాంక్ అధికారులు.