ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దారుణం.. భర్త చేతిలో భార్య హతం

national |  Suryaa Desk  | Published : Wed, Sep 22, 2021, 12:18 PM

పెళ్లైన 4 సంవత్సరాలకే ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసిన ఘటన యూపీలోని మీరట్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మీరట్‌ కు చెందిన దీపక్ కు రూబీ అనే యువతి ఓ రోజు ట్రైన్ లో పరిచయం అయ్యింది. వారు ఒకరి ఫోన్ నంబర్లు మరొకరు తీసుకున్నారు. ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. కొన్నాళ్ల తర్వాత ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలు కూడా పెళ్లికి ఒప్పుకోవడంతో వారి పెళ్లి జరిగింది. వారికి ఒక పాప పుట్టింది. కొన్ని నెలల తర్వాత ఆ పాప అనారోగ్యం కారణంగా చనిపోయింది. కొన్నాళ్లకు దీపక్ తండ్రి రాజ్‌కుమార్ చనిపోవడంతో దీపక్‌ కు, అతని తమ్ముడు గుడ్డూకు మధ్య విభేదాలొచ్చాయి. దీంతో దీపక్ మరోచోట ఇల్లు కట్టుకుని, అదే బిల్డింగ్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌ లో వ్యాపారం చేశాడు. లాక్‌ డౌన్ కారణంగా వ్యాపారంలో నష్టపోయాడు.


దీంతో అప్పటి నుంచి రూబీకి అదనపు కట్నం గురించి వేధింపులు మొదలయ్యాయి. ఆర్థిక సమస్యల కారణంగా భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. దీంతో క్షణికావేశంలో దీపక్ తన భార్య రూబీని హత్య చేశాడు. పోలీసులు దీపక్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. రూబీ తండ్రి రామచంద్ర గుప్త అదనపు కట్నం కోసం తన కూతురిని చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com