ఇండియాలో గడిచిన 24 గంటల్లో 26,964 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 34,167 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 383 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు 3,27,83,741 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. దేశంలో మొత్తం 4,45,768 మంది కరోనా వల్ల మరణించారు. ప్రస్తుతం దేశంలో 3,01,989 యాక్టివ్ కేసులున్నాయి.