ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా అసలు అవతారం చూపిస్తా.. రోడ్లమీదకి వస్తా.. వైసీపీ పై బాలయ్య ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 21, 2021, 10:55 PM

నెల్లూరు  జిల్లా కార్యకర్తలతో హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి నటసింహం బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా అసలు అవతారం చూపిస్తా.. నేనేంటో, నా సంగతి ఏంటో చూపిస్తా.. బోయపాటి సినిమా తర్వాత నేను రోడ్లమీదకి వస్తా. ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నా.. దేనికీ భయపడవద్దు.. అయ్యేదేదో అవుతుంది. నేను మానసికంగా ప్రిపేర్ అవుతున్నా.. దేనికైనా సిద్ధం’ అని బాలయ్య హెచ్చరించారు.


‘ఏపీ రాష్ట్రం రావణకాష్టంగా మారింది. రాముడు 14 ఏళ్లు అరణ్యవాసం చేశారు. ఇదీ అంతే’ అంటూ బాలయ్య వ్యాఖ్యానించారు. బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఇప్పటివరకు పొలిటికల్‌గా బాలయ్య సైలెంట్ గా ఉన్నారు. ఇలాంటి తరుణంలో బాలయ్య చేసిన తీవ్ర వ్యాఖ్యలను బట్టి చూస్తే.. రాజకీయంగా స్పీడ్ పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com