సీఎం జగన్ వద్దకు దర్శి నియోజకవర్గం వివాదం చేరింది. ఎమ్మెల్యే వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్రెడ్డి వర్గాల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. దర్శి నియోజకవర్గం ముండ్లమూరు ఎంపీపీ ఎన్నిక విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో సీఎం క్యాంపు ఆఫీస్కు దర్శి నియోజకవర్గ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. తమ వర్గానికి చెందిన వారినే ఎంపీపీగా ఎంపిక చేయాలని రెండు వర్గాలు పట్టుబడుతున్నాయి. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా సీఎంను ఎమ్మెల్యే వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి కలిశారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురి మధ్య సయోధ్య కుదర్చాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎంపీపీగా ఎవరిని నియమించాలో పార్టీ నిర్ణయిస్తుందని జగన్ పేర్కొన్నారు. సీఎం జగన్ హామీతో ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు వెళ్లిపోయారు.