అనంతపురం జిల్లాలోని అమ్మవారి పల్లి వద్ద ఉన్న కియా అనుబంధ సంస్థ హోండాయి గ్లోవిస్ వద్ద ఘర్షణ పడిన నలుగురు ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రమ్య తెలిపారు. మధుసూదన్ రెడ్డి, శివ,యువరాజు, వంశీలపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రమ్య పేర్కొన్నారు.
కియా ఇండియా కార్ల కంపెనీ అమ్మవారిపల్లి వద్ద నెలకొల్పిన కార్ల పరిశ్రమ ప్రదాన ప్లాంటులో ఆదివారం ఉద్యోగుల మధ్య గర్షణ తలెత్తిన వివాదం తెలిసిందే. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కియా ఇండియా కంపెనీలో ఉద్యోగుల మధ్య తలెత్తిన ఘర్షణ వివాదం వాట్సప్ సోషల్ మీ డియాలో హల్చల్ చేసింది. ఆదివారం అమ్మవారిపల్లి వద్ద కియా ఇండియా ప్రధాన ప్లాంటులో హుండాయ్, ట్రాన్సిస్ కంపెనీ ఉద్యోగుల సీనియర్ జూనియర్ల మధ్య వివాదం తలెత్తడంతో ఒకరినొకరు రాడ్లతో కొట్టుకున్నారు. కియా ప్రధాన ప్లాంట్లో జరిగిన ఘర్షణ ఎలాంటి వివాదానికి దారితీస్తుందోనని ఉద్యోగులు భయ బ్రాంతులకు గురవుతున్నారు. కియా కార్ల పరిశ్రమలో ఏ వివాదం జరిగినా బయటకు తెలియకపోవడం గమనార్హం.