ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీళ్ళు ఆంధ్రా తాలిబన్లలా ప్రవర్తిస్తున్నారు : మంత్రి పేర్ని నాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 21, 2021, 06:25 PM

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న కక్షను కొందరు రాష్ట్రం పై చూపిస్తున్నారని, వాళ్ళ పోకడ చూస్తుంటే ఆంధ్రా తాలిబన్లలా మారిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఎన్ని పోస్టులు పెట్టినా సీఎం జగన్‌ని ఏమి చేయలేరని తెలిపారు.


మద్రాస్‌కి సంబంధించిన ఓ వ్యక్తి వ్యాపారానికి విజయవాడ అడ్రస్ పెట్టుకుని, అతను మత్తు మందు తరలిస్తూ పట్టుబడితే.. దాన్ని ఎల్లో మీడియా విజయవాడలో పాపాలు జరుగుతున్నట్లు రాస్తున్నారంటూ మండిపడ్డారు. బెజవాడలో భూకబ్జాలు చేసే వీళ్ళు గుజరాత్‌లో పట్టుబడ్డ హెరాయిన్ గురించి మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. హెరిటేజ్ వ్యాన్‌లలో ఎర్రచందనం దుంగల్ని జపాన్ తరలించింది నిజమా కాదా అంటూ ప్రశ్నించారు. ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా వాళ్లు బుద్ధి తెచ్చుకోవడం లేదని, ఇప్పటికైనా మారకపోతే భవిష్యత్తులో సింగిల్ డిజిట్ కూడా రాదని చెప్పారు. సీఎం జగన్‌కి ఓటు మీద ఓటు వేస్తున్నారని ప్రజలపై దుర్మార్గంగా ప్రవర్తించవద్దని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com