కృష్ణా జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరులపాడు మండలం జయంతి లో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 959 బస్తాల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. తమకు అందిన సమాచారంతో పోలీసులు దాడి చేసి బియ్యాన్ని పట్టుకున్నారు. లారీని సీజ్ చేసారు. రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.