తూర్పు గోదావరి: అయినవిల్లి మండలం ముక్తేశ్వరం వృద్ధ గౌతమి వద్ద ఆదివారం సాయంత్రం వినాయక నిమజ్జన కార్యక్రమంలో భాగంగా వెలిగించిన దీపం వల్ల ఓ ఫైబర్ పడవ అగ్ని ప్రమాదంలో పాక్షికంగా కాలిబూడిదైంది. ఈ సమయంలో అ పడవపై వేట వలలు పూర్తిగా కాలి బుడిదయ్యాయని పడవ యజమాని కొప్పాడి అర్జునరావు తెలిపారు. రూ. 3 లక్షలు నష్టం వాటిల్లిందని అర్జునరావు ఆవేదన వ్యక్తం చేశారు.