ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాహనంలో చెలరేగిన మంటలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 18, 2021, 06:44 PM

అనంతపురం: రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్ వద్ద ఓమినీ వాహనంలో భారీగా మంటలు చెలరేగాయి. వాహనంలో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సహకారంతో ప్రమాదం నుండి బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు. స్థానికులు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. రాయదుర్గం వైపు నుంచి బళ్లారి వైపుకు వెళుతుండగా ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వాహనం ఎవరిది అన్నది తెలియాల్సి ఉంది. ఇంజన్ తీవ్రంగా వేడెక్కి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com