కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజ్భవన్ వెళ్లి గవర్నర్కు అందించారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఆయన తన నివాసం నుంచి రాజ్భవన్ వెళ్లారు. అక్కడికి చేరుకుని గవర్నర్..కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. రాజ్భవన్ వెళ్తుండగానే ఆయన కుమారుడు రణీందర్ సింగ్ తండ్రి రాజీనామాను ధ్రువీకరించారు. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ గవర్నర్ను కలిశారని, తన రాజీనామాతోపాటు క్యాబినెట్ మంత్రుల రాజీనామాలను సమర్పించినట్టు పంజాబ్ సీఎం మీడియా అడ్వైజర్ రవీన్ తుక్రాల్ వెల్లడించారు. మరికొద్దిసేపట్లో రాజ్భవన్ గేట్ ముందు మీడియాతో మాట్లాడనున్నట్టు తెలిపారు. పంజాబ్లో కొన్ని నెలలుగా రాజకీయ సంక్షోభం రగులుతూనే ఉన్నది. సిద్దూ నాయకత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనపై ధిక్కారాన్ని వెల్లడించారు.