ట్రెండింగ్
Epaper    English    தமிழ்

450 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌

national |  Suryaa Desk  | Published : Sat, Sep 18, 2021, 04:39 PM

మినీరత్న కంపెనీ అయిన సౌత్‌ ఈస్టర్న్‌ కోల్డ్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఈసీఎల్‌)లో వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎలాంటి రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.


మొత్తం ఖాళీలు: 450


ఇందులో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ మైనింగ్‌ 140, టెక్నీషియన్‌ అప్రెంటీసెస్‌ మైనింగ్‌ లేదా మైన్‌ సర్వేయింగ్‌ 310 చొప్పున ఉన్నాయి.


అర్హతలు: మైనింగ్‌ ఇంజినీరింగ్‌ లేదా మైన్‌ సర్వేయింగ్‌లో డిప్లొమా, డిగ్రీ పాసై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి.


ఎంపిక ప్రక్రియ: డిగ్రీ, డిప్లొమాలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌


దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 5


వెబ్‌సైట్‌: http://www.mhrdnats.gov.in/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com