భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా మళ్లీ అనిల్ కుంబ్లే బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదివీకాలం ముగియనుంది. ఆ తర్వాత హెడ్ కోచ్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవాలని అనిల్ కుంబ్లేను బీసీసీఐ కోరనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. అనిల్ కుంబ్లే 2016-17 మధ్య కాలంలో టీమిండియా హెడ్ కోచ్గా పని చేశాడు. సచిన్, లక్ష్మణ్, గంగూలీ నేతృత్వంలోని అప్పటి అడ్వైజరీ కమిటీ కుంబ్లేను కోచ్గా నియమించింది. కానీ విరాట్, కుంబ్లే మధ్య మనస్పర్ధలు రావడంతో కుంబ్లే కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు.
ఐపీఎల్ లోని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటర్ గా ఉన్న లక్ష్మణ్ కు కూడా కోచింగ్ బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోందట. కుంబ్లే, లక్ష్మణ్లు హెడ్ కోచ్ పోస్టుకు దరఖాస్తు చేసుకుంటారా లేదా అన్నదే సస్పెన్స్ గా మారింది. టీ20 వరల్డ్కప్ తర్వాత టీ 20 క్రికెట్కు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లో కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. లక్ష్మణ్, కుంబ్లేలు ఇద్దరూ 100 కు పైగా టెస్టులు ఆడిన నేపథ్యంలో వారికి కోచ్ పదవి దక్కేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మాజీ బ్యాట్స్మెన్ విక్రమ్ రాథోడ్ కూడా కోచ్ పోస్టుకు పోటీపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.