ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరుగు తింటే ఎన్నో లాభాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 18, 2021, 04:34 PM

పెరుగన్నం తింటే ఎన్నో లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


- పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అది దంతపుష్టికి, ఎముకల దృఢత్వానికి దోహద పడుతుంది.


- పెరుగు కీళ్ల నొప్పులను నివారిస్తుంది.


- కొందరు చిన్నారులు పెరుగన్నం తినడానికి ఇష్టపడరు. వారికి పెరుగు తినడం అలవాటు చేయాలి.


- పెరుగులో ఉన్న ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మెదడు చురుగ్గా పనిచేసేట్లు చేస్తాయి.


- పెరుగులో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్‌, పీచుపదార్థాలు ఆహారం త్వరగా జీర్ణమయ్యేట్లు చేస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి.


- పెరుగులోని మినరల్స్‌ వల్ల శరీర ఉష్ణోగ్రత సమంగా ఉంటుంది.


- రోజు పెరుగు తినడం వల్ల రక్తప్రసవరణ బాగా జరిగి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.


- నిత్యం పెరుగు తినేవాళ్లకి రక్తపోటు వచ్చే అవకాశం తక్కువ అని పలు అధ్యయనాలలో తేలింది.


- పెరుగులో ఉండే ల్యాక్టో బాసిల్లస్ బ్యాక్టీరియా శరీరంలోని తెల్ల రక్తకణాలను పెరిగేలా చేస్తుంది. పెరుగు శరీరానికి కావల్సిన విటమిన్ కె అందిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com