ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి శనివారం మాత్రమే పూరి జగన్నాధ్ ఆలయంలోకి అనుమతి

national |  Suryaa Desk  | Published : Sat, Sep 18, 2021, 02:29 PM

 కరోనా థర్డ్ వేవ్ తలెత్తవచ్చనే ఆందోళన నేపధ్యంలో కొవిడ్‌-19 నిబంధనలను ఒడిషా ప్రభుత్వం కఠినతరం చేసింది. నేటి నుంచి ప్రతి వారంలో శనివారం మాత్రమే పూరి జగన్నాధ్ ఆలయంలోకి భక్తులను అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహమ్మారి తీవ్రతతో నాలుగు నెలల విరామం అనంతరం పూరి జగన్నాధ్ ఆలయం ఆగస్ట్ 23న భక్తుల కోసం తిరిగి తెరిచారు. అప్పటినుంచి వారానికి ఐదు రోజులు ఆలయంలోకి భక్తులను అనుమతించారు.


ఇక ఆలయం సందర్శించే భక్తులు విధిగా కొవిడ్‌-19 టీకా రెండు డోసులు తీసుకున్న సర్టిఫికెట్ లేదా కొవిడ్‌-19 నెగెటివ్ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. భక్తులు తమ ఆధార్, ఓటర్ ఐడీ వంటి పోటో గుర్తింపు కార్డు చూపుతూ సింహద్వారం నుంచి లోపలికి రావాల్సి ఉంటుందని, దర్శనానంతరం ఉత్తరద్వారాం నుంచి వెలుపలికి పంపుతారని అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com