సమాచారం లేకుండా వైసీపీ నాయకులు చంద్రబాబు ఇంటిపై దాడికి వచ్చారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. వైసీపీ నేతల దాడిలో తాను స్పృహ తప్పి పడిపోయానన్నారు. వైసీపీ శ్రేణులు తమపై దౌర్జన్యం, దాడి చేసి కొట్టారన్నారు. జగన్ సర్కార్ దౌర్యన్యానికి ఇది పరాకాష్ట అన్నారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కూడా వైసీపీ నేతలకే వత్తాసు పలికారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. జగన్ ఫ్యాక్షనిజానికి ఇదే నిదర్శనం అని వ్యాఖ్యానించారు.