భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లి ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్కప్ తర్వాత విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడు. ఇప్పుడు భారత జట్టుకు తర్వాతి కెప్టెన్ ఎవరు అన్నదానిపై చర్చ నడుస్తోంది. ఈ రేసులో రోహిత్ శర్మ ముందు వరుసలో ఉన్నాడు. అయితే కొంత మంది మాజీ క్రికెటర్లు మాత్రం కేఎల్ రాహుల్ కి కెప్టెన్సీ ఇవ్వాలని అంటున్నారు.
లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ 34 ఏళ్ల రోహిత్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే బదులు.. అతని కంటే యువకుడైన కేఎల్ రాహుల్ బెటరని సునీల్ గవాస్కర్ స్పష్టం చేశాడు. స్పోర్ట్స్ తక్ చానెల్ తో గవాస్కర్ మాట్లాడుతూ.. మీరు కొత్త కెప్టెన్ గురించి చూస్తుంటే కేఎల్ రాహుల్ వైపే చూడాలన్నది నా ఆలోచన. అతడు ఐపీఎల్, 50 ఓవర్ల క్రికెట్ లోనూ బాగా ఆడుతున్నాడు. ఐపీఎల్లోనూ కెప్టెన్సీ భారం తనపై లేకుండా స్వేచ్ఛగా ఆడుతున్నాడని సునీల్ గవాస్కర్ చెప్పారు. 29 ఏళ్ల కేఎల్ రాహుల్ ఈ మధ్య కాలంలో అన్ని ఫార్మాట్లలోనూ గొప్పగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా కూడా నిలకడగా రాణిస్తున్నాడు.