ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పనస పండుతో ఎన్నో ప్రయోజనాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 17, 2021, 02:35 PM

పనస పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహాన్ని నియంత్రించడంలో పనస పండు కీలక పాత్ర పోషిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. తాజాగా ఏపీలోని శ్రీకాకుళం మెడికల్ కాలేజీ, మహారాష్ట్రలోని పుణె మెడికల్ ఇన్ స్టిట్యూట్ ల సంయుక్త పరిశోధనలోనూ ఇదే విషయం వెల్లడైంది. షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో ఈ పండు బాగా పనిచేస్తుందని నిర్ధారించారు.


మధుమేహం ఉన్నవారు, ప్రీ-డయాబెటిస్ రోగులు తరచూ పనస పండును తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పనసను ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలో గ్లూకోజ్ శాతం తగ్గుతుందని కూడా వీరి పరిశోధనలో తేలింది. టైప్-2 డయాబెటిస్ ఉన్న 40 మంది రోగులతో వరి, గోధుమలకు బదులుగా పనస పిండితో చేసిన వంటకాలు నెలలపాటు తినిపించారు. కేవలం 7 రోజుల్లోనే వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినట్లు గుర్తించారు.


ఆహారంలో పనసపొడిని కలుపుకుని తినడం వల్ల రక్తపోటును నివారించుకోవచ్చు. రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. జీర్ణక్రియను మెరుగుపర్చుకోవచ్చు. పనస పొడిలో ప్రోటీన్‌ కూడా ఎక్కువేనని వైద్యులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com