ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయనగరం జిల్లాలో అన్యుహ ఘటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 17, 2021, 01:22 PM

విజయనగరం జిల్లాలో అన్యుహ ఘటన చోటు చేసుకుంది. ఆటోలో ఉన్న సాయిరాం స్వాముల్ని చూసి దొంగలుగా భావించి బాలికలు భయపడిన ఘటన విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలో జరిగింది. విద్యార్థులు పాఠశాలకు సైకిల్‌పై వెళుతుండగా ఈ ఘటన జరిగింది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మేము పాఠశాలకు వెళుతుంటే మాలో కొందరిని ఈ దారి ఎటువెళుతుందని స్వాములు అడిగారు. వారు సమాధానం చెప్పారు. అయితే స్వాములు ఆటోలో మా వెంట రావడం గమనించాం. దాంతో మాకు భయం వేసింది. వాళ్లను దొంగలుగా భావించి పరుగెత్తి..మా ఊరి వాళ్లకు విషయం చెప్పారు.


స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. అయితే వారిని విద్యార్థినులు దొంగలనుకుని..తమను కిడ్నాప్ చేయడానికి వచ్చారని భయపడి స్థానికులకు చెప్పారు. దాంతో స్థానికులు తమకు సమాచారం ఇచ్చారు. స్వాముల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించాం. లాక్ డౌన్ కు ముందే వాళ్లు(స్వాములు) మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి వచ్చినట్లు తేలింది. కాగా అప్పటినుంచి స్వాములు బిక్షాటన చేస్తున్నారు. అయితే స్వాములపై క్రిమినల్ రికార్డు కానీ..కేసులు కానీ ఇప్పటి వరకైతే లేవు. వాళ్లు ప్రయాణించే ఆటో వివరాలు కూడా పరీశీలిస్తున్నాం. త్వరలో తదుపరి వివరాలు తెలియజేస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com