ఇండియాలో గడిచిన 24 గంటల్లో 34,403 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా నుంచి 37,950 మంది కోలుకోగా 320 మంది కరోనాతో చనిపోయారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,33,81,728 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు వరకు 3,25,98,424 మంది కోలుకోగా 4,44,248 మంది కరోనా వల్ల మరణించారు. ప్రస్తుతం దేశంలో 3,39,056 యాక్టివ్ కేసులున్నాయి.