విశాఖ జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలమంచిలి మండలం రేగుపాలెంలో వ్యానులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వ్యాన్, 220 కిలోల గంజాయి, 125 కొబ్బరి బస్తాలు, రెండు ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.