తూర్పు గోదావరి జిల్లాలో 16 వ నెంబరు జాతీయ రహదారిపై లారీలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు జగ్గంపేట సీఐ సురేష్ బాబుకు వచ్చిన సమాచారం మేరకు జగ్గంపేట మండలం రామవరం శివారు రాజస్థాన్ దాబా వద్ద ఆగి ఉన్న లారీని పోలీసులు తనిఖీ చేశారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల విలువైన 2000 కేజీల గంజాయిని పట్టుకుని , నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ. 2, 27, 000 నగదు , 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు