తూర్పు గోదావరి: ముమ్మిడివరం మండలం తాళ్లరేవు స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు బ్యూరో ఇన్ స్పెక్టర్ జె. విభవాని బుధవారం తెలిపారు. కొత్త మంజేరుకు చెందిన పుణ్యమంతుల సుబ్రహ్మణ్యం, గండి రాంబాబు 149 మద్యం బాటిళ్లను రెండు మోటారు సైకిళ్లపై యానాం నుంచి అక్రమంగా తరలిస్తుండగా ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. యానాం మద్యం సరపరా చేస్తున్న జుట్టువరపు ఆనందరావును అరెస్టు చేశారు. సుంకరపాలెం చింతాకులవారిపేటకు చెందిన నందం లక్ష్మి శివకార్తీక్ 80 మద్యం బాటిల్స్ మోటారు సైకిల్ పై తరలిస్తుండగా పట్టుకున్నారు. వారి నుంచి 229 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకుని, మూడు వాహనాలను సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. కోర్టు ఆదేశాలతో నలుగురు వ్యక్తులను రిమాండ్ కి పంపినట్టు తెలిపారు. దాడుల్లో ఎఎస్సై కుమార్, మహేష్ సిబ్బంది పాల్గొన్నారు.