తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి జాతీయ రహదారిపై రోడ్డు గురువారం ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీనితో ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అన్నవరం పెట్రోలింగ్ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని యాక్సిడెంట్ జరిగిన తీరుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.