తూర్పు గోదావరి: పి. గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని అదృశ్యంపై పి. గన్నవరం పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పి. గన్నవరం మండలంలోని నరేంద్రపురం గ్రామానికి చెందిన బి. శ్రీనివాసరావు కుమార్తె కొత్తపేటలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఈ నెల 4 నుండి తన కుమార్తె కనిపించకపోవడంతో చుట్టుప్రక్కల, బంధువుల ఇళ్ల వద్ద వెతికిన ప్రయోజనం లేకపోవడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అతని ఫిర్యాదు పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.