తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పెద్దాపురం పట్టణ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొని..బైక్ పై వెళ్తున్న నరసింహారావు అనే (60) వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన పై స్థానికులు అందించిన సమాచారంతో సంఘటన స్థలికి పెద్దాపురం పోలీసులు చెరుకుని ప్రాధమిక దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దాపురం ఎస్ఐ మురళీమోహన్ చెప్పారు.