భాతర బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, టోక్కో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పివి సింధుకు ఢిల్లీ ఎయిర్పోర్టులో ఘనస్వాగతం లభించింది. ప్రస్తుతం టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్లో పాల్గొన్న సింధు కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రెండు ఒలింపిక్స్లో వరుసగా పతకాలు సాధించిన భారత మహిళా క్రీడాకారిణిగా సింధు రికార్డు సృష్టించింది. కాగా, మంగళవారం మధ్యాహ్నం స్వదేశానికి వచ్చిన సింధుకు ఢిల్లీ ఎయిర్పోర్టులో క్రీడా శాఖ, బ్యాడ్మింటన్ అకాడమీ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పివి సింధు మాట్లాడుతూ.. ఒలింపిక్స్లో పతకం సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇదిలా ఉండగా, భారత ఒలింపిక్స్ క్రీడాకారుల బృందం ఆగస్టు 15 వేడుకల్లో పాల్గొననుంది. ఈ మేరకు ఒలింపిక్స్లో పాల్గొన్న క్రీడాకారులను ప్రధాని మోడీ ఆహ్వానించారు. అదే రోజున క్రీడాకారులతో మోడీ భేటీ కానున్నారు.