అనంతపురం: తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్లో చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి నిరసనకు దిగారు. రాత్రంతా ఆఫీస్లోనే జేసీ ప్రభాకర్రెడ్డి, కౌన్సిలర్లు ఉన్నారు. తాడిపత్రిలో అధికారుల వైఖరిని నిరసిస్తూ జేసీ ఆందోళనకు దిగారు. మున్సిపల్ ఆఫీస్లో సమీక్ష ఉందని చెప్పినప్పటికీ... అధికారులు రాకపోవడంపై చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. నిన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డితో సమీక్ష తర్వాత సెలవుపై మున్సిపల్ కమిషనర్ వెళ్లిపోయారు. ఉన్నతాధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకూ... మున్సిపల్ ఆఫీస్లోనే ఉంటానని ఏబీఎన్ హెడ్ లైన్ షోలో జేసీ వెల్లడించారు.