మచిలీపట్నం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. యాక్టివా బైక్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గూడూరు మండలం తరకటూరు సమీపంలో చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తి మచిలీపట్నానికి చెందిన అబ్దుల్ గా పోలzసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.