ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తూర్పు గోదావరి జిల్లాలో దారుణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 02, 2021, 11:53 AM

తూర్పు గోదావరి జిల్లాలో దారుణం వెలుగుచూసింది. తన పదేళ్ల కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని మందలించిన పాపానికి ఓ తండ్రిని అతి కిరాతకంగా హతమార్చాడు యువకుడు. ఈ ఘటన రాజోలు మండలం చింతలపల్లెలో చోటుచేసుకుంది. అలస్యంగా వెలుగచూసిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చింతలపల్లె గ్రామానికి చెందిన నేతల భాస్కర్ రావు అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన పదేళ్ల చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ యువకుడిని చిన్నారి తండ్రి మార్లపూడి సురేష్‌ నిలదీశాడు. ఇదే విషయాన్ని భాస్కర్ రావు చేస్తున్న చెడు పనుల గురించి అతని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆగ్రహించి భాస్కర్ రావు చిన్నారి తల్లిదండ్రులతో వాగ్వివాదానికి దిగాడు. ఇద్దరి మధ్య ఘర్షణ చోటుకుంది. దీంతో మార్లపూడి సురేష్ (33) పై కర్రతో నేతల భాస్కర్ అనే యువకుడు దాడి చేశాడు. తలకు తీవ్ర గాయాలవ్వడంతో.. అతన్ని స్థానికులు హుటాహుటిన రాజమండ్రి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఇవాళ సురేష్ మరణించాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న భాస్కర్ రావు కోసం పోలీసులు గాలిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com