విశాఖ స్టీల్ప్లాంట్ కార్మికుల ఉద్యమం ఢిల్లీని తాకింది. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కార్మికుల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో విశాఖ స్టీల్ప్లాంట్ కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ కార్మికుల నినాదాలు చేస్తున్నారు. విశాఖ స్టీల్ప్లాంట్కు గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ప్లాంట్ అప్పులను ఈక్విటీలుగా మార్చాలని డిమాండ్ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జంతర్మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తామని కార్మిక సంఘాలు వెల్లడించాయి.