మైనింగ్ వ్యవహారంలో టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమాపై హత్యాయత్నం కేసు నమోదవడం పట్ల టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. తుగ్లక్ రెడ్డి పాలనలో అన్నీ రివర్స్లో జరుగుతున్నాయని విమర్శించారు. రెండేళ్లుగా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని వార్తా పత్రికలతో పాటు దేవినేని ఉమా కూడా చెబుతున్నారని అన్నారు. అక్రమ తవ్వకాల వద్ద దొరికిన జెసిబిలు, టిప్పర్లను జగన్ రెడ్డి అధికారులే స్వాధీనం చేసుకుని జరిమానా విధించారని చెప్పారు. అయితే, ఈ తుగ్లక్ రెడ్డి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను జైల్లో వేస్తే తనకు రావాల్సిన వాటా ఎక్కడ ఆగిపోతుందోనని, రివర్స్లో దేవినేని ఉమాను అక్రమ కేసులో ఇరికించారని ఆరోపించారు. తాము ఇవన్నీ గుర్తుంచుకుంటామని, అధికారంలోకి రాగానే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారు.