ఏలూరు టౌన్: ఏలూరు నగర మేయర్ పీఠంపై వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడింది. ఏలూరు కార్పొరేషన్ ఆవిర్భవించిన తర్వాత మూడోసారి జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయభేరి మోగించింది. నూతన పాలక వర్గం శుక్రవారం కొలువుదీరింది. నగర మేయర్గా నూర్జహాన్, డిప్యూటీ మేయర్లుగా జి.శ్రీనివాసరావు, ఎన్.సుధీర్బాబు ఎన్నికయ్యారు. ఏలూరు కార్పొరేషన్లోని 50వ డివిజన్ నుంచి గెలుపొందిన నూర్జహాన్ రెండోసారి మేయర్ అయ్యారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నగర అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నారు. 2014లో ఆమె తొలిసారి మేయర్ పీఠాన్ని అధిరోహించారు.
రెండో డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ ఎన్నిక.. రెండో డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ ఎన్నికలో భాగంగా తిరుపతి రెండో డిప్యూటీ మేయర్గా భూమన అభినయరెడ్డి ఎన్నికయ్యారు.