నాగార్జున సాగర్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం అదృశ్యమైన జెన్కో ఉద్యోగి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. మృతుల్లో ఇద్దరు దంపతులు, వారి కుమారుడు ఉన్నారు. తమ చావుకు తామే కారణమంటూ వారు సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. వారు గురువారం సాయంత్రం కొత్త బ్రిడ్జిపై నుంచి కృష్ణా నదిలో దూకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం ఉదయం చింతలపాలెం వద్ద కృష్ణా నదిలో బాలుడు సాత్విక్ మృతదేహం లభ్యమైంది. దంపతులు రామయ్య, నాగమణి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. అనారోగ్య సమస్యల కారణంగానే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు భావిస్తున్నారు.