పశ్చిమగోదావరి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 31 మండలాల్లో 6,986 హెక్టార్లలో పంట పొలాలు నీట మునిగాయి. ముంపుకు గురైన పొలాల్లో 1,475 హెక్టార్లలో నారుమళ్లు, 5,511 హెక్టార్లలో వరి నాట్లు ఉన్నాయి. మరో రెండు రోజులు వర్షాలు కురిస్తే నారుమళ్లు పూర్తిగా దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈదురుగాలులకు పలుచోట్ల అరటి, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.