ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక సమాచారం ఇచ్చింది. జులై 23(శుక్రవారం) ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం 4గంటలకు వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడిట్ బోర్డు తెలిపింది. విద్యార్థులు http://examresults.ap.nic.in , http://results.bie.ap.gov.in/ , http //results.apcfss.ac.in , https://bie.ap.gov.in/ వెబ్ సైట్లలో ఫలితాలు చూసుకోవచ్చని ప్రకటించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో విద్యార్థులకు వచ్చిన మార్కులు, సెకండ్ ఇయర్ లో ఇంటర్నల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అధికారులు విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను మాత్రమే విడుదల చేస్తున్న ప్రభుత్వం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రం పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.