ఇటీవలే టీడీపీ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేశారు. ఆమె త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా టీడీపీకి గుంటూరు జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ ఖాన్ తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో జియావుద్దీన్ వైసీపీలో చేరారు. జగన్ మైనారిటీలకు డిప్యూటీ సీఎంతో సహా అనేక పదవులు ఇచ్చి ఎంతో గౌరవిస్తున్నారని జియావుద్దీన్ అన్నారు. అందుకే వైసీపీలో చేరానని, టీడీపీలో తనకు అన్యాయం జరిగిందని అన్నారు. టీడీపీ సీనియర్ నేత, దివంగత లాల్ జాన్ బాషా సోదరుడు జియావుద్దీన్ గుంటూరు టీడీపీలో సీనియర్ నేతల్లో ఒకరిగా ఉన్న సంగతి తెలిసిందే.