త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వైకాపా ఎంపీలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. సభలో వైకాపా ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై జగన్ వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా పోలవరం నిధుల అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామన్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు గళం వినిపిస్తామన్నారు. కేఆర్ఎంబీ పరిమితిని కేంద్రం నోటిఫై చేయాలని కోరుతామన్నారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై పార్లమెంట్లో ప్రస్తావిస్తామని తెలిపారు.