కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజల్ని కాపాడేందుకు కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన మందు సంజీవనిలా పనిచేస్తోంది. ప్రస్తుతం ఆనందయ్య మందును రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు నేరుగా అందిస్తున్నాయి. ప్రతిరోజూ వేలాది మందికి మందు పంపిణీ చేస్తున్నారు. కరోనా సోకనివారికి, పాజిటివ్ వచ్చిన వారికి అవసరాన్ని బట్టి ఔషధాన్ని అందిస్తున్నారు. ఐతే తాను తయారు చేసి అందిస్తున్న మందుపై ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు వ్యక్తులు తనపేరుపై నకిలీ మందులు తయారు చేసి అమ్ముకుంటున్నారని అన్నారు. మంగళవారం నెల్లూరుజిల్లా చిట్టమూరు మండలం, మల్లాంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించిన ఆనందయ్య.. ఈ వ్యాఖ్యలు చేశారు. నకిలీ మందుపై రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.