అంతరించిపోయిందనుకున్న అరుదైన సాలెపురుగు జాతి కీటకం మళ్లీ దర్శనమిచ్చింది. 1868 సంవత్సరానికి ముందు జీవించిన ఈ ‘జంపింగ్ స్పైడర్’ కీటకం ఒకటిన్నర శతాబ్ధం తర్వాత 2018లో కేరళలో కనిపించింది. ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ జిల్లాలో ఉన్న యోగివేమన విశ్వవిద్యాలయంలోని బొటానికల్ గార్డెన్ లో పరిశోధకుల కంట పడింది. ఇంద్రధనస్సు వలే సప్తవర్ణశోభితంగా కనువిందు చేసింది. ఈ అరుదైన కీటకంపై సైంటిస్టులు పరిశోధనలకు సిద్దమయ్యారు.