వినియోగదారుల హక్కుల అవగాహన పై పనిచేస్తున్న అడ్వొకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ సంస్థ ఆసరా సమావేశం విశాఖ నగరంలోని ఓ హోటల్లో గురువారం నిర్వహించారు. ఆసరా కృష్ణ జిల్లా అధ్యక్షుడిగా తరుణ్ కాకానిను నియమించారు. తరుణ్ కాకానితో పాటు, జిల్లా కమిటీ సభ్యులకు డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్ జడ్జి ఆర్ మాధవరావు నియామక పత్రాలను అందజేశారు.
అనంతరం జడ్జి ఆర్ మాధవరావు మాట్లాడుతూ.. వినియోగదారుల హక్కుల గురించి అవగాహన కల్పిస్తూ, నష్టపోయిన వినియోగదారులకు న్యాయం కల్పించేందుకు ఆసరా కృషి చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వినియోగదారుల హక్కులు తెలియడంలేదని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ తమ సేవలను విస్తరించి, అవగాహన కల్పించేందుకు త్వరలో మొబైల్ వాహనాలు ప్రారంభిస్తున్నారని చెప్పారు.
నిబద్దత గల సభ్యులతో జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఆసరా జిల్లా అధ్యక్షుడు తరుణ్ కాకాని మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు , వారి హక్కుల కోసం పోరాడుతామని తెలిపారు. జిల్లాలో మొబైల్ వ్యాన్లతో అవగాహన కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. ఆసరా జాతీయ అధ్యక్షులు హబీబ్ సుల్తాన్ అలీ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల రక్షణ కోసం ఆసరా సంస్థ పనిచేస్తోందన్నారు.
దేశవ్యాప్తంగా 2000 వినియోగదారులు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు.. 300 విజయవంతమైన కేసులను కోర్టులలో దాఖలు చేసిందన్నారు. 10000 కు పైగా వినియోగదారుల కేసులు ఆసరా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించబడ్డాయిని తెలిపారు. త్వరలో మన రాష్ట్రంలో "లీగల్ అవేర్నెస్ మొబైల్ వంశ్ " ను ప్రారంభించాలని ఆసరా యోచిస్తోందన్నారు.