(శ్రీకాకుళం) వంశధార ప్రాజెక్ట్ ఆయువు పట్టైన ప్రతిపాదిత నేరడి బ్యారేజ్ నిర్మాణ స్థలాన్ని కాట్రగడ వద్ద పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఒడిస్సా తో అడ్డంకులు తొలగిన నేపథ్యంలో బ్యారేజ్ నిర్మాణానికి సవివర నివేదిక (డి పి ఆర్) తయారు చేయాలని ఆదేశించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
ఒడిశాలో ముంపునకు గురవుతున్న నూట ఎకరాల భూమిని సేకరించడానికి, లేదా ప్రత్యామ్నాయ స్థలం కొనుగోలుకు రెవెన్యూ అధికారులు నివేదికలు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం ధర్మాన. మంత్రులతో పాటు పర్యటనలో పాల్గొన్న పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, ఎంఎల్సి దువ్వాడ శ్రీనివాస్, వంశధార ఎస్.ఇ డొల తిరుమల రావు తదితరులు