ఇకపై ట్రైన్ టికెట్లు బుక్ చేయాలంటే కచ్చితంగా ఆధార్ లేదా పాస్పోర్ట్ తప్పని సరిచేసే దిశగా భారతీయ రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆన్లైన్ టికెట్ల రిజర్వేషన్లలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయడం, బ్లాక్ టికెట్లను నిరోధించడంతోపాటు ఏజెంట్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కృషి చేస్తున్నట్లు తెలిపింది. ఇకనుంచి యూజర్ నేమ్, పాస్వర్డ్ తో కాకుండా కేవలం ఆధార్ నంబర్ లేదా పాస్పోర్ట్ నంబర్తో లాగిన్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.