ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమర రాజా కంపెనీ కొత్త చైర్మన్‌గా గల్లా జయదేవ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 15, 2021, 11:55 AM

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అమర రాజా గ్రూప్ అఫ్ కంపెనీ భారతదేశానికి చెందిన బహుళజాతి సంస్థ. అమర రాజా కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం తిరుపతి సమీపంలో ఉన్న కరకంబాడిలో ఉంది. అమరరాజా గ్రూప్ ఆటోమోటివ్ బ్యాటరీ బ్రాండ్ అమరోన్ తయారీలో మంచి గుర్తింపు పొందింది. ఇది ఎక్సైడ్ ఇండస్ట్రీస్ తరువాత భారతదేశంలో రెండవ అతిపెద్ద అమ్మకపు ఆటోమోటివ్ బ్యాటరీ బ్రాండ్


అయితే ఇటీవల అమర రాజా కంపెనీకి సంబంధించిన ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే ఎంతో కాలంగా కంపెనీ యొక్క అభివృద్ధికి పాటుపడిన కంపెనీ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ గల్లా రామచంద్ర తన చైర్మన్ పదవికి స్వస్తి పలికాడు. ఈ స్థానంలో గల్లా రామచంద్ర కుమారుడు మరియు ఎంపి గల్లా జయదేవ్ అమర రాజా కంపెనీకి కొత్త చైర్మన్ గా రానున్నారు.గల్లా జయదేవ్‌ కొత్త చైర్మన్‌గా ఆగస్టు నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. అప్పటివరకు గల్లా రామచంద్ర ఆ పదవిలో కొనసాగుతారు. ఆగస్టులో జరిగే వార్షిక సర్వ సభ్య సమావేశం తరువాత జయదేవ్ చైర్మన్‌ హోదాలో కొనసాగనున్నారు.


అమర రాజా కంపెనీకి దాదాపు 36 సంవత్సరాల పాటు సారథ్యం వహించి, అగ్రగామిగా తీర్చిదిద్దగలగడం తనకు చాలా సంతృప్తి కలిగిందని రామచంద్రనాయుడు పేర్కొన్నారు. రామచంద్రనాయుడుతో పాటు ఇప్పటివరకు కంపెనీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న రమాదేవి గౌరినేని బోర్డుకు రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను బోర్డు ఆమోదించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com